DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లా కేంద్రంలో మంచిర్యాల మున్సిపల్ కమీషనర్ భార్య ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ భార్య ఇంట్లో ఎవ్వరు లేని సమయం చూసి మంగళవారం ఆదిత్య ఎన్ క్లేవ్ కాలనీలో చున్నితో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

