DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్ లో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో CPR గురించి అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ మరియు దేవాదాయ శాఖా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, కలెక్టర్ బాధవత్ సంతోష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ CPR ఎటువంటి సందర్భాలలో చెయ్యాలో తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పి ఛైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మి, మంచిర్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేత, బెల్లంపల్లి ఎంపీపీ శ్రీనివాస్, DMHO సుబ్బారాయుడు సూపరింటెండెంట్ అరవింద్, హాస్పిటల్ సిబ్బంది, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

