DIGITAL MANCHERIAL NEWS:- టీఎస్ పిఎస్ సి పరీక్షను ఎంతో పగడ్బందిగా నిర్వహించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్న పత్రాన్ని ఎలా లీక్ చేస్తారని బెల్లంపల్లికి చెందిన సామాజిక నేత జాడి రాజేష్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నరని ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి చదువుకున్న విద్యార్థులు వారి కుటుంబాలను పక్కన పెట్టీ కోచింగ్ లు తీసుకొని ఒక పక్క అప్పు చేసి హాస్టల్స్ లో ఉంటూ పేద విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రశ్న పత్రల లికేజీపై సమగ్ర కార్యాచరణ చేపట్టి, సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించి నిందితులకు తగిన శిక్ష ను వేయాలని రాజేష్ డిమాండ్ చేశారు.

