DIGITAL MANCHERIAL NEWS:- డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 132 వ జయంతి సందర్భంగా తాండూర్ మండలంలోని కస్తూరిబా గాంధీ విద్యాలయంలో బెల్లంపల్లి కి చెందిన తాజ్ బాబా సేవ సమితి ఉస్మాన్ విద్యార్థులకు, నోటు బుక్కులు, పెన్నులు అరటి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా హాజరైన సామాజిక కార్యకర్త జాడి రాజేష్, ఎస్ఐ సమ్మయ్య లు మాట్లాడుతూ... పేద ప్రజలకు, విద్యార్థులకు సామాజిక సేవ చేస్తూన్న ఉస్మాన్ తాజ్ బాబా సేవలు అభినందనియమని కొనియాడారు. విద్యార్థులు బాగా చదువుకోని పాటశాలకు తలిదండ్రులు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అపరిచిత వ్యక్తులు, ఆకతాయిల పట్ల విద్యార్థినిలు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఆపద సమయంలో 1098, లేదా 100 కాల్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ప్రశాంత్, ఎస్ఓ కవిత, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.


