DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి పట్టణంలోని బిఆర్ఎస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో బెల్లంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపి, శాలువతో సత్కరించిన క్యాథలిక్ చర్చ్ క్రైస్తవ సోదరులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... క్రైస్తవులు ఎంతో పవిత్రులతో 40 రోజుల పాటుగా ఉపవాస దీక్షలు ఉంటూ ప్రత్యేక పూజలు పాల్గొంటూ 40 రోజులు అయినా అనంతరం భక్తిశ్రద్ధలతో క్రైస్తవ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ చర్చిలకు వెళ్లి భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేసే, గ్రామాలలో ఊరేగింపుల ద్వారా ఘనంగా జరుపుకునే ఏకైక పండుగ ఈస్టర్ అని కొనియాడారు. ఈ యొక్క కార్యక్రమంలో జాడీ రాజేష్, దుర్గం చంద్రశేఖర్, డేవిడ్ తో పాటు ఇతర క్రైస్తవులు పాల్గొన్నారు.

