DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బస్సు డిపో దగ్గర ఘోర ప్రమాదం సంభవించి కండక్టర్ అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాలు చూసుకుంటే... అదిలాబాద్ బస్ డిపో కు చెందిన గంగారాం అనే కండక్టర్ ప్రమాదవశాత్తు మంచిర్యాలలో బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు, ఆర్టీసీ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్నారు.

