DIGITAL MANCHERIAL NEWS:- అదిలాబాద్ జిల్లాలోని తానుర్ మండలంలో ఆర్ఎంపీ మిస్సింగ్ అయిన సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... తానుర్ మండలంలోని మహాలింగి గ్రామానికి చెందిన కార్పె గంగాధర్ RMP మూడు రోజుల కిందట అదృశ్యమయ్యాడు. మూడు రోజుల నుండి ఇంటికి రాకపోవడంతో వారి కుటుంబ సభ్యులు సమీప పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదుచేశాడు. ఎస్సై బి. విక్రమ్ మిస్సింగ్ కేసు నమోదు చేసి, ఎవరికైనా ఆచూకీ తెలిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని సూచించారు.

