DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లాలోని తాండూర్ మండలంలోని ఐబి సమీపంలో గల శనివారం సంత జరిగే ప్రదేశం ఎదురుగా వెల్డింగ్ షాప్ దగ్గర లో గుర్తు తెలియని మహిళా మృతదేహం హైవే రోడ్డు పక్కన గల డ్రైనేజీ పైన ఉంది. దీనిని చూసిన ప్రజలు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఈ యొక్క మృతికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటన స్థలానికి చేరుకున్న స్థానిక పోలీసులు వివరాలు దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా కావాల్సి కొని హత్య చేశారా... లేదా ఆత్మహత్య చేసుకొని ఉంటుందా అని పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

