DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి నియోజకవర్గ పరిధిలోనీ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నేతకానీ సంగం నాయకులు జాడి రాజేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సమాజంలో నేతకానీ జాతి అంటే ఈ రాష్ట్రానికే తెలిసే విధంగా అహర్నిశలు కృషి చేశారని నేతకానీ తొలి ఎమ్మెల్యే అని సంతోషం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గారంటే పేదలను ఆదరించే నాయకుడని, ఒక రైతు సాధారణ కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి అని తెలియచేశారు. ఎమ్మెల్యే అంటే నిరంతరం ప్రజలతో మమేకమై నిరుపేదలకు ఆర్థిక సహాయాన్ని అందించడం తో పాటు ఒక సాధారణ జీవితాన్ని గడుుతుంటారు. కరోనా పరిస్థితుల్లో తన దైన శైలిలో ఎంతో మందికి సహాయాన్ని అందించడం. పేద విద్యార్థులు ఉచిత కోచింగ్ సెంటర్ పెట్టీ బోజన సదుపాయాన్ని కల్పించి తన వంతుగా కృషి చేసిన ఘనత ఎమ్మెల్యే చిన్నయ్యదే అని స్పష్టం చేశారు. అలాగే ఎవరికైనా ఎపుడైనా ఏ ఆపద వచ్చిన నేను ఉన్నాను అంటూ బరోసా ఇచ్చే గొప్ప నాయకుడు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. రానున్న ఎన్నికల్లో మళ్లీ ఎమ్మెల్యే ని గెలిపించి కెసిఆర్ కి కేటీఆర్ కి మా జాతి రుణపడి ఉంటుందని తెలిపారు.

