DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి పట్టణంలోని తాజ్ బాబా సేవాసమితి ఆధ్వర్యంలో ఉస్మాన్ పాషా నిర్వహిస్తున్న సేవ కార్యక్రమాలను సంఘీక మాధ్యామలలో చూసి అతను చేసే సేవకార్యక్రమాలకు ఆకర్షితులైన హైదరాబాద్ రాజ్యాన్ని పాలించిన ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ముని మనువడు, మీర్జా మహమూద్ అలీ ఖాన్(పెద్దపల్లి) మనువడు మీర్జా మోహిబ్ బేగ్ హైదరాబాద్ లోని తన నివాసంలో తాజ్ బాబా సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఉస్మాన్ పాషాను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం ఇరువురు భేటీ అయ్యి భవిష్యత్తులో చేయబోయే సేవకార్యక్రమాల గురించి చర్చించుకున్నారు. ఈ సందర్బంగా మీర్జా మోహిబ్ బేగ్ మాట్లాడుతూ... రాబోయే రోజుల్లో ఉస్మాన్ పాషాతో కలిసి బెల్లంపల్లిలో ఉచిత వాకర్లు, చేతి కర్రల క్యాంప్ నిర్వహిస్తామని హామీ ఇస్తున్నానని తెలిపారు.

