వివరాల్లోకి వెళితే... రెబ్బెన మండలంలోని ఖైరిగూడ గ్రామం గొల్లగూడాలో గురువారం సాయంత్రం రమాకాంత్ అనే యువకుడు వ్యవసాయపు పనులు ముగించుకొని ఇంటికి వచ్చేసరికి ఇంటి సమీపంలో విద్యుత్ ఘాతానికి గురై రెండు బర్రెలు చనిపోవడంతో... విద్యుత్తును చూసుకోకుండా బర్రెలను తాకడంతో రమకాంత్ కూడా అక్కడికక్కడే మృతి చెందాడు. రమకాంత్ విద్యుత్ ఘాతంతో మృతి చెందడంతో గ్రామం మొత్తంలో విషాదఛాయలు అలమటించుకున్నాయి.


