DIGITAL MANCHERIAL NEWS:- రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడుతు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు
భారతీయ రాష్ట్ర సమితి పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు మంగళవారం కాసిపేట మండలంలోని ధర్మరావుపేట్ రైతు వేదికలో రైతు సదస్సులో స్థానిక రైతులతో కలిసి చర్చించిన బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో రైతులకు అండగా నిలుస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీ ఒక్కటేనని...
రైతులకు ఎన్నో రకాలుగా అండగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ చంద్రయ్య, వైస్ ఎంపీపీ విక్రమ్ రావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మంజుల, శేఖర్, ఎంపీటీసీ రామ్ చందర్, సర్పంచ్ స్వప్న, శ్రీనివాస్, ఆడే బాధు, మరియు ఇతర ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, రైతులు, స్థానిక ప్రజలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


