వివరాల్లోకి వెళితే... భీమిని మండలంలోని రాజారాం గ్రామానికి చెందిన దుర్గం ఆశ్రిత్ (13) చీరతో ఉయ్యాలో ఊగుతుండగా ప్రమాదవశాత్తు మెడకు చీర చుట్టుకుని ఊపిరాడకుండా అయ్యాడు... వెంటనే చూసిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ కు తరలిస్తుండగా మృతి చెందినట్లు ఎస్సై మహేందర్ తెలిపారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు.

