ఫ్లాష్ న్యూస్:- తప్పిన పెను ప్రమాదం... ఊపిరి పీల్చుకున్న ఆర్టీసీ అధికారులు.

D Prashanth Netha
0
DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లాలోని జన్నారం మండలంలో పెను ప్రమాదం తప్పింది.

 వివరాల్లోకి వెళితే... జన్నారం మండలంలోని రాంపూర్ గ్రామంలో ఆర్టీసీ కార్గో బస్సు అంగన్వాడీ కేంద్రాలకు సరుకులను చేరవేయడానికి వెళ్లిన క్రమంలో వెంకటేశ్వర స్వామి ఆలయం మూలమలుపు వద్ద విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో విరిగిపోయిన విద్యుత్ స్తంభం ఆర్టిసి బస్సు పై పడింది. ఆ ప్రమాదం జరిగిన సమయంలో గ్రామంలో విద్యుత్ లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పి ఎవరికీ ఎటువంటి ప్రాణహాని జరగకుండా అందరూ సురక్షితంగా బయటపడ్డారని అధికారులు తెలిపారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by