DIGITAL MANCHERIAL NEWS:- మణిపూర్ లో జరుగుతున్న అల్లర్లపై అదిలాబాద్ డయోసీస్ మంచిర్యాల పట్టణంలో ఆదివారం రోజున నిర్వహించేే శాంతి ర్యాలీ కి అన్ని క్రైస్తవ సంఘాలు తరలి రావాలని అదిలాబాద్ డయోసీస్ కాథలిక్ బిషప్ ప్రిన్స్ అంతోని పిలుపనిచ్చారు.
దేశంలో అటు మణిపూర్ లో జరుగుతున్న అల్లర్లపై క్రైస్తవుల పై జరుగుతున్న హత్యలపై అదే విధంగా సుమారు రెండు వందల చర్చ్ లను నిప్పు తో తగలబెట్టిన ఘటన చూస్తే గుండెలు పగిలేలా బాధించయని , అదేవిధంగా ఎంతో మంది మహిళలు వారిపై హత్యచారలు జరగడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది అని పేర్కొన్నారు. కాబట్టి ఆదివారం రోజున మణిపూర్ అల్లర్లపై క్రైస్తవులు అంత ఏకంగా వారికి మద్దతుగా న్యాయం చేయాలని మంచిర్యాల పట్టణం లో సాయంత్రం నాలుగు గంటలకు క్రైస్తవుల శ్యాంతి ర్యాలీ మొదలు కాబోతుంది కావున క్రైస్తవ సహోదరులు ఇతర క్రైస్తవ సంగాల ప్రజలు అందరు కూడ దీనిలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

