వివరాల్లోకి వెళితే... బెల్లంపల్లి పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న బాల్మికి అనుదీప్ అనే యువకుడిని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. యువకుడు పోలీసులను చూసి పారిపోతున్న సమయంలో అతనిని పట్టుకొని తనిఖీ చేయగా అతని వద్ద 500 గ్రాముల గంజాయి లభించింది. దొరికిన గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు తదుపరి విచారణ కోసం యువకుడని పోలీస్ స్టేషన్లో అప్పగించారు.

