DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి నియోజకవర్గానికి మూడోసారి అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించిన సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని మంగళవారం బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మర్యాదపూర్వకంగా కలిశారు.
ఆమెకు పుష్పగుచ్చం అందించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నాపై నమ్మకంతో నాకు మళ్ళీ టికెట్ ఇచ్చినందుకు గాను... కృతజ్ఞతలు తెలిపి రానున్న ఎన్నికలలో 50000 ఓట్ల మెజార్టీతో గెలుస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు నిరంజన్ గుప్తా, ప్రణయ్, గట్టు సంతోష్ కుమార్, శాలిగామా బానయ్య తదితరులు పాల్గొన్నారు.

