DIGITAL MANCHERIAL NEWS:- తెలంగాణ రాష్ట్రంలో ప్రజా గాయకుడు గద్దర్ మరణించడంతో తెలంగాణ రాష్ట్రం ఒక గాన కోయిలను కోల్పోయింది.
గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న గద్దర్. హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. గద్దర్ మరణవార్తను ఆయన కొడుకు సూర్యం ధృవీకరించారు. ప్రజా గాయకుడు గద్దర్ మరణవార్తతో ఆయన అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు. కాగా, 1949 జూన్ 5న తూప్రాన్ లో జన్మించిన గద్దర్.. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో క్రియా శీలక పాత్ర పోషించారు.

