ఫ్లాష్ న్యూస్:- ఫ్రెండ్షిప్ డే రోజు విషాదం... ముగ్గురు మృతి...!

D Prashanth Netha
0
DIGITAL MANCHERIAL NEWS:- స్నేహితుల రోజు దినోత్సవం సందర్భంగా... ముగ్గురు మిత్రులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనీ తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.
 

వివరాల్లోకి వెళితే... ఏలూరు రామచంద్ర ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్న 10 మంది విద్యార్థులు మారేడుమిల్లి విహార యాత్రకు వెళ్లారు. విహారయాత్రను ముగించుకొని వస్తున్న సందర్భంలో వీరు ప్రయాణిస్తున్న కారు బూరుగుపూడి గేటు వద్ద కాలువలోకి దూసుకెళ్లింది. ఈ యొక్క ప్రమాదంలో హర్షవర్ధన్, హేమంత్, ఉదయ్ కిరణ్ ముగ్గురు స్నేహితులు ప్రాణాలు కోల్పోగా... మిగతా విద్యార్థులు గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదమునకు గల కారణాలు పరిశీలిస్తే విద్యార్థులు అధిక వేగం వల్ల కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తుంది. కాలువల పడ్డ కారును క్రేన్ సహాయంతో బయటికి తీశారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by