DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లా కేంద్రంలోని దిక్సూచి సూర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ నగర్లోని సున్నం బట్టి వాడ వంద పీట్ల రోడ్డు ప్రాంతంలో అదునాతన పరికరాలతో నూతంగా నిర్వహిస్తున్న AH బ్యూటీ పార్లర్ లో బ్యూటీ అండ్ వెల్నెస్ పై ZPHS చెన్నూర్ విద్యార్థుల కి ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు దుర్గం స్వామి, ఏ.హెచ్ బ్యూటీ అండ్ వెల్నెస్ డైరెక్టర్ అనూష, పాఠశాల ప్రిన్సిపల్ సరిత లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బ్యూటీ అండ్ వెల్నెస్ రంగంపై ప్రాక్టికల్ గ అవగాహన కల్పించారు. రానున్న రోజుల్లో బ్యూటిపార్లల్ లపై అవకాశాలు ఉన్నాయని అదేవిధంగా స్వయం ఉపాధి ద్వారా ఆదాయం పొందే వివిధ మార్గాలపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు స్వప్న, లావణ్య, సృజన, PD సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

