DIGITAL MANCHERIAL NEWS:-
- పాటి, బొగంపల్లి రోడ్లను పరిశీలించిన DRDO కిషన్.
- సోమవారం కలెక్టర్ కి చేసిన ఫిర్యాదు కు స్పందన.
మంచిర్యాల జిల్లాలోని నేన్నెల మండలంలోని కోణంపేట (పాటి), మన్నెగూడెం (బొగంపల్లి) ఆదివాసి గిరిజన గ్రామాల ప్రజలు సోమవారం కలెక్టర్ కి చేసిన ఫిర్యాదు పై కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం DRDO కిషన్ గిరిజన గ్రామాలను సందర్శించి పరిశీలించారు. గిరిజన గ్రామాలకు రోడ్డు మరియు కల్వర్ట్ మంజూరు, సీఎం గిరివికాస పథకం క్రింద మంజూరు అయిన బోర్లకు విద్యుత్ లైన్ అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో ఎండీపీవో అబ్దుల్ హై, మన్నెగుడెం సర్పంచ్ మధుకర్,ఎపివో నరేష్, ఈసి స్వామి,టి. ఎ కళ్యాణ్, ఎఫ్.ఎ చీకటి గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

