DIGITAL MANCHERIAL NEWS:-
- యాసంగి పంటలు వేసి మూడు నెలలు అవుతుంది.
- రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు సీఎం గారు.
- ట్విట్టర్ ద్వారా తెలంగాణ సీఎంను అడిగిన యువకుడు.
-- మంచిర్యాల జిల్లాలోని నేన్నెల మండలం మెట్పల్లి గ్రామానికి చెందిన యువకుడు ట్విట్టర్ లో చేసిన ఒక ట్వీట్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అదేమిటంటే... యాసంగి పంట వేసి మూడు నెలలు కావస్తుంది... రైతు భరోసా ఏది సారు అంటూ ట్విట్ చేశాడు. అలా చేసిన ట్వీట్ ను ఉపముఖ్యమంత్రి కి మరియు సంబంధిత శాఖ మంత్రికి ట్యాగ్ చేశాడు. ఇప్పుడు యువకుడు చేసిన ట్వీట్ వైరల్ గా మారడంతో... కనీసం ప్రభుత్వం స్పందించి ఇప్పుడైనా రైతు భరోసా వేయాలని పలువురు అనుకుంటున్నారు.

